ఈ దీపావళికి భారత్ లో అమ్మకాల జోరు... చైనాకు రూ.40 కోట్ల నష్టం!
- చైనా ఉత్పత్తులపై నిషేధం ప్రకటించిన సీఏఐటీ
- భారత్ లో పండుగ అమ్మకాల విలువ రూ.72 వేల కోట్లు
- లాభాల బాటలో దేశీయ ఉత్పత్తిదారులు
గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగి భారత సైనికులు చనిపోయిన తర్వాత సీఏఐటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో చైనా ఉత్పత్తులు విక్రయించరాదని పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ దీపావళికి అధికంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, బొమ్మలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వంటగది వస్తు సరంజామా, గిఫ్టులు, స్వీట్లు, తినుబండారాలు, బంగారం, పాదరక్షలు, వాచీలు, ఫర్నిచర్, దుస్తులు అమ్ముడయ్యాయి.
దీనిపై సీఏఐటీ స్పందిస్తూ భవిష్యత్ లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. దేశీయ ఉత్పత్తిదారులకు మంచిరోజులు వస్తాయని అభిప్రాయపడింది.