అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపులపై ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
- అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు శుభవార్త
- రూ.20 వేల లోపు డిపాజిటర్లకు చెల్లింపులకు అనుమతి
- వచ్చే మార్చిలోపు పూర్తిచేయాలని స్పష్టీకరణ
వాదనల సందర్భంగా ఏపీ సర్కారు తరఫు న్యాయవాది.... అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వివరాలను సీఐడీ సీఐ వార్డు సచివాలయాల ద్వారా సేకరిస్తారని హైకోర్టుకు తెలిపారు. సీఐ సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని, డిపాజిటర్ల దరఖాస్తులను కలెక్టర్, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీఐడీ ఎస్పీ ధ్రువీకరిస్తారని వివరించారు.