Andhra Pradesh: ఏపీలో కొత్తగా 2,745 పాజిటివ్ కేసులు.. కరోనా అప్ డేట్స్ ఇవిగో!

AP registers 2745 new Corona cases
  • 24 గంటల్లో మరో 13 మంది మృతి
  • 8,35,953కి చేరిన మొత్తం కేసులు
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 21,878
ఏపీలో కరోనా తీవ్రత తగ్గినప్పటికీ... కొత్త కేసులు మాత్రం పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,745 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 428 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 407 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 38 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 85,364 మంది శాంపిల్స్ ని పరీక్షించారు. తాజా గణాంకాలతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,35,953కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 6,757కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,878 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,07,318 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News