Atchannaidu: ఏపీఎస్ఆర్టీసీ లక్షకు పైగా కిలోమీటర్లను కోల్పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం: అచ్చెన్నాయుడు

TDP leader Atchannaidu reacts on RTC agreement between AP and Telangana
  • ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం
  • ఈ ఒప్పందంతో ఆర్టీసీ మనుగడకే ముప్పుందన్న అచ్చెన్న
  • రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపాటు
ఇవాళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు రోడ్డెక్కనున్నాయి. చెరో 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పుకునేందుకు ఇరు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే, ఈ ఒప్పందం ఏపీఎస్ఆర్టీసీ మనుగడకే ముప్పు వంటిదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.

ఏపీఎస్ఆర్టీసీ కొత్త ఒప్పందం కారణంగా లక్షకు పైగా కిలోమీటర్లను కోల్పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్టీసీనే కాకుండా కార్మికులను కూడా నష్టపరుస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని అచ్చెన్న విమర్శించారు. తెలంగాణలో బినామీ ఆస్తుల రక్షణకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని మండిపడ్డారు.
Atchannaidu
APSRTC
TSRTC
Agreement
Andhra Pradesh
Telangana

More Telugu News