గిల్గిత్-బాల్టిస్థాన్కు ప్రావిన్షియల్ హోదా.. ఖండించిన భారత్
- ఇమ్రాన్ ప్రకటనపై భారత్ మండిపాటు
- మానవ హక్కులను హరిస్తోందని ఆగ్రహం
- గిల్గిట్-బాల్టిస్థాన్ భారత అంతర్భాగమన్న శ్రీవాస్తవ
పాక్ ప్రకటన ఆ ప్రాంతంలో ఏడు దశాబ్దాలుగా నివసిస్తున్న వారి మానవ హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. మానవ హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, దోపిడీ, స్వేచ్ఛను హరిస్తున్న పాకిస్థాన్ ఇలాంటి ప్రకటనలతో అసలు నిజాలను దాచలేదన్నారు. దురాక్రమణలకు స్వస్తి చెప్పి ఆక్రమిత ప్రాంతాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అనురాగ్ హెచ్చరించారు.