సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ: సీఎం కేసీఆర్
- సాదా బైనామా క్రయవిక్రయాలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్
- ఉత్తర్వులు జారీ చేయాలంటూ సీఎస్ కు ఆదేశాలు
అంతకుముందు సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించారు. అనంతరం సీఎంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని వారు సీఎం కేసీఆర్ ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామా క్రయవిక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.