క్రిస్ గేల్కు జరిమానా విధించిన ఐపీఎల్ యాజమాన్యం
- రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన గేల్
- 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన వైనం
- ఆగ్రహం తట్టుకోలేక బ్యాట్ ను విసిరికొట్టిన స్టార్ బ్యాట్స్ మెన్
భారీ సిక్సర్లతో విరుచుకుపడిన గేల్... చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో బంతిని సిక్సర్ గా మలిచి 99 పరుగులకు చేరాడు. ఆ తర్వాతి బంతికి గేల్ ను ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆగ్రహాన్ని తట్టుకోలేక బ్యాట్ ను విసిరికొట్టాడు. ఆ తర్వాత ఆర్చర్ ను మెచ్చుకుంటూ పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే, ఐపీఎల్ నిబంధనల మేరకు బ్యాట్ ను విసిరికొట్టడం రూల్స్ కు విరుద్ధం. దీంతో, గేల్ కు ఐపీఎల్ యాజమాన్యం మ్యాచ్ ఫీజులో కోత విధించింది.