భారీ వర్షాల ఎఫెక్ట్: కుంగిన పురానాపూల్ బ్రిడ్జి.. రాకపోకలు నిలిపివేత
- హైదరాబాద్లో తొలి వంతెనగా రికార్డు
- వరద నీటి తాకిడితో ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు
- మరమ్మతుల అనంతరం రాకపోకల పునరుద్ధరణ
4 శతాబ్దాల కాలంలో పురానాపూల్ బ్రిడ్జి దెబ్బతినడం ఇది రెండోసారి మాత్రమే. హైదరాబాద్లో నిర్మించిన తొలి వంతెనగా రికార్డులకెక్కిన ఈ బ్రిడ్జి 1820లో వచ్చిన మూసి వరదలకు స్వల్పంగా దెబ్బతింది. దీంతో అప్పటి నవాబు సికిందర్ షా మరమ్మతులు చేయించాడు. 1908లో మరోమారు దీనికి మరమ్మతులు చేశారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ వెళ్లేందుకు వీలుగా 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్షా దీనిని నిర్మించాడు.