సెల్లార్ లో వర్షం నీళ్లు.. కరెంటు షాక్తో వైద్యుడి మృతి!
- భారీ వర్షానికి సెల్లార్లోకి చేరిన నీళ్లు
- మోటార్తో బయటకు పంపే ప్రయత్నంలో విద్యుదాఘాతం
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు రావడంతో అది నిండిపోయింది. దీంతో నిన్న ఉదయం నీటిని తోడేందుకు మోటార్ వేసేందుకు సతీశ్రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.