Telangana: తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య

spike of 1300 new cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 1,335 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,00,611
  • 1,72,388 మంది డిశ్చార్జ్  
తెలంగాణ‌లో కొత్తగా కరోనా కేసుల నమోదు కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,335 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,176 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,00,611 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,72,388 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,171కు చేరింది. ప్రస్తుతం 27,052 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 262, రంగారెడ్డి జిల్లాలో 137 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..
  
Telangana
Corona Virus
COVID19

More Telugu News