తేయాకు అద్దకంతో మాస్కులు... శ్రీలంక వినూత్న ఆవిష్కరణ
- అన్ని రంగాలను దెబ్బతీసిన కరోనా
- సిలోన్ టీ బ్రాండ్ కు మరింత ప్రచారం కల్పిస్తున్న శ్రీలంక
- సిలోన్ టీని మరిన్ని దేశాలకు విస్తరించే ప్రణాళిక
ఐస్ టీ తయారుచేసినప్పుడు మిగిలే పొడితో ఈ డై తయారుచేసి మాస్కుపై అద్దకం చేస్తారు. ఈ మాస్కులు 30 ఉతుకుల వరకు మన్నికగా ఉంటాయని ఎస్ఎల్ టీబీ చెబుతోంది. ఈ మాస్కులు సహజసిద్ధంగానే సూక్ష్మక్రిములపై పోరాడే గుణం కలిగి ఉంటాయని, పర్యావరణ హితమని, విష పదార్థ రహితమని పేర్కొంది. ప్రస్తుతం ఈ మాస్కులను శ్రీలంక విదేశీ మంత్రిత్వ శాఖ తమ విదేశీ దౌత్యకార్యాలయాల ద్వారా ఉచితంగా అందిస్తోంది. తద్వారా తమ సిలోన్ బ్రాండ్ టీకి మరింత ప్రచారం లభిస్తుందని ఎస్ఎల్ టీబీ భావిస్తోంది.