Daggubati Purandeswari: దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌

purandeswari tests corona positive
  • ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
  • కరోనా లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్షలు
  • ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు కొవిడ్‌-19 సోకిందని వైద్యులు గుర్తించారు.

అయితే, తనకు కరోనా సోకిన విషయంపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు ఆమె కాసేపటి క్రితం ట్వీట్ చేయడం గమనార్హం.
Daggubati Purandeswari
BJP
Corona Virus
COVID-19

More Telugu News