నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దేశం
- 6 డిసెంబరు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత
- నిందితులుగా ఎల్కే అద్వానీ, జోషీ వంటి సీనియర్ నేతలు
- విచారణ సమయంలోనే 17 మంది నిందితుల మృతి
6 డిసెంబరు 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ (92), కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి (86), యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర వంటి మొత్తం 49 మంది హేమాహేమీలు నిందితులుగా ఉన్నారు. వీరిలో బాలాసాహెబ్ థాకరే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిశోర్, పరమహంస రామచంద్ర దాస్, వినోద్ కుమార్ వత్స్, రాంనారాయణ్ దాస్ తదితర 17 మంది నిందితులు మరణించారు.