చంద్రబాబు ఇంటికి నోటీసులు.. ముంపు నేపథ్యంలో హెచ్చరికలు
- ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా కృష్ణకు పోటెత్తుతున్న వరద
- చంద్రబాబు ఇల్లు సహా మరో 36 భవనాలకు హెచ్చరిక నోటీసులు
- ప్రకాశం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు చేరుకున్న నీటి మట్టం
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరుకోగా, ఇన్ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులు ఉంది. ఫలితంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్లో ఇళ్లు నీటమునిగాయి. దీంతో విజయవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత బాధితులను తరలిస్తున్నారు. కంట్రోల్ రూము ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.