వాసుపల్లి రాకతో పార్టీ బలం పెరిగింది: విజయసాయిరెడ్డి
- వైసీపీకి దగ్గరైన వాసుపల్లి గణేశ్
- వాసుపల్లి కుటుంబం విశాఖకు ఎంతో సేవ చేస్తోందన్న విజయసాయి
- విశాఖలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్య
వాసుపల్లి గణేశ్ కుటుంబం విశాఖకు ఎంతో సేవ చేస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. వారు రావడంతో పార్టీకి ఎంతో బలం వచ్చిందని చెప్పారు. విశాఖ జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉన్నా, లేకున్నా ఒకటేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదని, ఇక ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉంటాడని ఎద్దేవా చేశారు.