ఢిల్లీలో నిర్మలా సీతారామన్ ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి... జీఎస్టీ మాఫీ కోసం విజ్ఞప్తి
- జీఎస్టీ రద్దుతో మరిన్ని కార్యక్రమాలు చేయగలుగుతామని వెల్లడి
- పాత నోట్లపై ఆర్బీఐని ఆదేశించాలని విజ్ఞప్తి
- భక్తులు పెద్ద సంఖ్యలో పాత నోట్లు హుండీలో వేశారన్న వైవీ
అంతేకాకుండా, హుండీ ద్వారా లభించిన రూ.1000, రూ.500 పాత నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐకి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం 2016 నవంబరు 8న అప్పటి పెద్ద నోట్లు రద్దు చేసిందని, కానీ ఆ తర్వాత కూడా భక్తులు పాత నోట్లను హుండీలో వేస్తూ వచ్చారని వివరించారు. అందుకే, ఆ నోట్లను ఆర్బీఐలో కానీ, మరే ఇతర బ్యాంకులోనైనా కానీ డిపాజిట్ చేసేందుకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు తన భేటీ వివరాలను వైవీ సుబ్బారెడ్డి ట్విట్టర్ లో తెలియజేశారు.