కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ ప్రకటన
- మళ్లీ ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా
- డిశ్చార్జి సమయంలో డాక్టర్ల సలహా పాటించిన అమిత్ షా
- పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కంప్లీట్ హెల్త్ చెకప్
దీనిపై ఎయిమ్స్ వర్గాలు ప్రకటన జారీ చేశాయి. అమిత్ షాను ఆగస్టు 30న డిశ్చార్జి చేశామని, కానీ డిశ్చార్జి సమయంలో డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారని ఈ ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఆయన పూర్తి హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరారని వివరించారు. ఆయన ఒకట్రెండు రోజులు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.