అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే: ఏపీ మంత్రి శ్రీరంగనాథ రాజు
- నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు
- చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు
- కుమారుడి స్కాంకు, తండ్రికి సంబంధం లేదనడం న్యాయమా?
బీసీ కార్డును అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుల రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మాజీ మంత్రి పితాని కుమారుడు కుంభకోణానికి పాల్పడ్డారని... ఆ కుంభకోణానికి, తండ్రికి సంబంధం లేదని అనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. మరోవైపు శ్రీరంగనాథరాజుపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా అవినీతి ఆరోపణలు చేశారు. రంగనాథరాజు, ఆయన కుమారుడు వెంకటనరసింహరాజు ఇద్దరూ ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడ్డారని రఘురాజు ఆరోపించారు.