రోడ్డు ప్రమాదంలో గాయపడిన జంటను కారులో ఆసుపత్రికి పంపించిన తెలంగాణ బీజేపీ చీఫ్
- హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వెళుతున్న జంట
- గాయాలతో రోడ్డుపై దీనస్థితిలో జంట
- అదే మార్గంలో వెళుతున్న బండి సంజయ్ కాన్వాయ్
- స్థానిక నేత కారులో వారిని ఆసుపత్రికి తరలింపు
ఆ సమయంలో బండి సంజయ్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పర్యటన కోసం ఆ మార్గంలో వెళుతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆ జంటకు సాయం అందించే వాళ్లు ఎవరూ లేక దయనీయస్థితిలో ఉండడాన్ని సంజయ్ గుర్తించారు. వారి పరిస్థితి పట్ల వెంటనే స్పందించిన ఆయన స్థానిక బీజేపీ నేతకు చెందిన కారులో వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కూడా వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు.
