రైనా మేనత్త కుటుంబంపై దాడి ఘటనలో సిట్ నియామకం
- ఇటీవల పంజాబ్ లో దారుణం
- రైనా బంధువులపై దొంగల దాడి
- ఇద్దరు మృతి
రైనా కూడా యూఏఈ నుంచి భారత్ తిరిగొచ్చేయడంతో ఈ ఘటన తీవ్రత వెల్లడైంది. ఇప్పుడతని మేనత్త చావుబతుకుల్లో ఉంది. దాంతో ఈ ఘటనకు కారకులపై కఠినచర్యలు తీసుకోవాలంటూ రైనా పంజాబ్ సీఎంను కోరాడు. ఈ నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్ వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ కేసును త్వరగా తేల్చేందుకు సిట్ ను నియమించినట్టు తెలిపారు.
"బేటా, ఈ ఘటనకు కారకులను తప్పకుండా శిక్షిస్తాం" అంటూ రైనాకు సీఎం మాటిచ్చారు. కాగా, రైనా మేనత్త కుటుంబంపై దాడి చేసింది అత్యంత కిరాతకులైన 'కాలే కచ్చే గ్యాంగ్' సభ్యులని భావిస్తున్నారు.