వైసీపీ కండువా కప్పుకున్న పంచకర్ల రమేశ్ బాబు
- వైసీపీలో చేరిన పంచకర్ల
- పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
- గత ఎన్నికల్లో ఓటమిపాలైన పంచకర్ల
రమేశ్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రజారాజ్యం తరఫున పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ లతో పాటు పంచకర్ల కూడా టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో పరాజయం ఎదురైంది. అప్పటినుంచి టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.