భూములను ఆక్రమించుకున్న ఈ సంస్థపై ఏ కేసులు పెట్టారో చెప్పండి: దేవినేని ఉమ
- విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఓ బల్క్ డ్రగ్ కంపెనీ
- 108 ఎకరాలు ఆక్రమించిన ఫార్మా కంపెనీ
- దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు?
- ప్రభుత్వం మారగానే చకచకా కదిలిన ఫైలు
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటైన (బల్క్ డ్రగ్ కంపెనీ) హెటెరో డ్రగ్స్ భూ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని సదరు పత్రికలో పేర్కొన్నారు. 200 ఎకరాల్లో ఏర్పాటైన ఈ సంస్థ అనంతరం 400 ఎకరాలకు విస్తరించిందని, మరో అడుగు వేస్తూ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులను ఆక్రమించుకుందని అందులో ఉంది.