చెన్నై చేరుకున్న ధోనీ... ఐపీఎల్ సందడి మొదలుపెట్టిన సూపర్ కింగ్స్!
- శిక్షణ శిబిరం కోసం చెన్నై వచ్చిన ధోనీ
- కరోనా టెస్టులో ధోనీకి నెగెటివ్
- విజిల్ పోడు అంటూ ట్వీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
రైనా, దీపక్ చహర్ తదితర క్రికెటర్లతో కలిసి ప్రత్యేక విమానంలో వచ్చిన ధోనీ చెన్నై ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఫొటో పోస్టు చేసింది. తాలా దర్శనం రీలోడెడ్ అంటూ ట్వీట్ చేసింది. విజిల్ పోడు (ఈల కొట్టండి) అంటూ అభిమానులను ఉత్సాహపరిచింది. కాగా, రవీంద్ర జడేజా మినహా కీలక ఆటగాళ్లందరూ ఒక్కొక్కరుగా చెన్నై చేరుకుంటున్నారు.