రాజస్థాన్ రాజకీయం: విశ్వాస పరీక్షలో నెగ్గిన గెహ్లాట్ సర్కారు

Ashok Gahlot government has won vote of confidence in Assembly
  • అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ
  • మూజువాణి ఓటుతో నెగ్గిన అధికార కాంగ్రెస్
  • మళ్లీ దగ్గరైన గెహ్లాట్, సచిన్ పైలట్
అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన అశోక్ గెహ్లాట్ సర్కారు విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. విపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూజువాణి ఓటుతో నెగ్గింది. ఈ బల పరీక్ష ముగిసిన అనంతరం రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది. ఇటీవల, సీఎం అశోక్ గెహ్లాట్ కు, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్య విభేదాలు ముదిరి పాకాన పడి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిణామాలను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించినా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్లు రంగంలోకి దిగి సచిన్ పైలట్ ను తిరిగి అశోక్ గెహ్లాట్ చెంతకు చేర్చగలిగారు.
Go Back to Shorts
Ashok Gahlot
Vote Of Confidence
Congress
BJP
Rajasthan

More Telugu News