బురదలో కూర్చుని ఇలా చేస్తే కరోనా నయమవుతుందట... ఓ బీజేపీ ఎంపీ సలహా!
- కరోనాపై బీజేపీ నేతల వింత సలహాలు
- బురదలో కూర్చుని శంఖం ఊదాలంటున్న సుఖ్ బీర్ సింగ్ జౌనపురియా
- వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడి
బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా వ్యాధి నయమవుతుందని తెలిపారు. బురదలో కూర్చుని శంఖం ఊదితే ఇమ్యూనిటీ పెరుగుతుందని, తద్వారా కరోనాపై పోరాడే శక్తి వస్తుందని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ జౌనపురియా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే ఎంపీ... వంటికి బురద పూసుకుని యోగా చేస్తే వ్యాధులు నయమవుతాయని చెప్పారు.