స్వర్ణప్యాలెస్, రమేశ్ ఆసుపత్రి యజమానుల కోసం హైదరాబాద్, విజయవాడలో గాలింపు
- హోటల్ నిర్వహణతో తమకు సంబంధం లేదన్న రమేశ్ ఆసుపత్రి
- కొనసాగుతోన్న విచారణ
- నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలు
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావుతో పాటు ఆసుపత్రి యజమాని రమేశ్ ఆచూకీని గుర్తించడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. వారి కోసం హైదరాబాద్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. అగ్ని ప్రమాద ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.