డోస్ పెంచిన గ్లెన్ మార్క్.. ఫావిపిరవిర్ 400 ఎంజీ మాత్రల విడుదల!
- ఇప్పటివరకూ 200 ఎంజీ టాబ్లెట్లు మాత్రమే
- 400 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేసిన సంస్థ
- తొలి రోజున 9 మాత్రలు చాలని వెల్లడి
కాగా, ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చిన తొలి రోజున 18 టాబ్లెట్లు, ఆపై రోజుకు 8 టాబ్లెట్లను వేసుకోవాల్సి వచ్చేది. 400 ఎంజీ టాబ్లెట్లు అందుబాటులోకి రావడంతో, తొలి రోజున 9 మాత్రలు వేసుకుంటే సరిపోతుందని, ఆపై ఐదారు రోజుల పాటు రోజుకు 4 టాబ్లెట్లు తీసుకోవాల్సి వుంటుందని సంస్థ తెలిపింది. కాగా, ఇండియాలో ఫావిపిరవిర్ 400 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేసేందుకు అనుమతి పొందిన తొలి సంస్థ గ్లెన్ మార్క్ కావడం గమనార్హం.