పొరుగు దేశాల సంస్కృతిలో కూడా రాముడు ఉన్నాడు: మోదీ
- ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యం
- భూమిపూజలో పాల్గొనడం నా అదృష్ణం
- మనందరిలో రాముడు ఉన్నాడు
అయోధ్య భూమిపూజలో పాలుపంచుకోవడం తన అదృష్టమని మోదీ అన్నారు. మన దేశంలో పలు భాషల్లో రామాయణాన్ని రచించారని... రాముడు అనేది ఒక సత్యమని చెప్పారు. మనందరిలో రాముడు ఉన్నాడని చెప్పారు. రాముడు అనేది ఒక జాతీయ సెంటిమెంట్ అని అన్నారు. అయోధ్య భూమిపూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.