5 వేలకు పడిపోయిన తిరుమల భక్తుల సంఖ్య!
- తిరుమలపై లాక్ డౌన్ ప్రభావం
- రూ. 33 లక్షలకు తగ్గిన హుండీ ఆదాయం
- కొవిడ్-19 నిబంధనలను పాటిస్తున్నామన్న టీటీడీ
దానికి భిన్నంగా నిన్న కేవలం 5,090 మంది మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. వారిలో 1,405 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ.33 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కొండపైకి వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నామని, కొవిడ్-19 నిబంధనలన్నీ పక్కాగా పాటిస్తున్నామని తెలియజేశారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు అమలవుతున్న కారణంగా స్థానిక భక్తులెవరూ తిరుమలకు రావడం లేదని అధికారులు వెల్లడించారు.