North Korea: ఉత్తర కొరియాకు భారత్‌ సాయం.. టీబీ ఔషధాల సరఫరా!

  • ఉత్తర కొరియాలో క్షయ వ్యాధి నిరోధక ఔషధాల కొరత
  • సాయం చేయాలంటూ భారత్‌ను కోరిన డబ్ల్యూహెచ్‌వో
  • అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న భారత్
india helps north korea

ఉత్తర కొరియాకు భారత ప్రభుత్వం క్షయ వ్యాధి నిరోధక ఔషధాలను పంపనుంది. ప్రస్తుతం ఉత్తరకొరియాలో ఆ వ్యాధి సంబంధిత ఔషధాల కొరత నెలకొంది. దీంతో ఆ దేశానికి ఔషధాలు పంపి, సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. ఆ వినతిపై భారత్ సానుకూలంగా స్పందించింది. సుమారు మిలియన్ డాలర్ల (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు) విలువైన టీబీ మందులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేస్తూ ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వినతి మేరకు ఔషధాలను పంపుతామని చెప్పింది. కాగా, ఉత్తరకొరియాలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

  • Loading...

More Telugu News