భారత యుద్ధ విమానాన్ని నేపాల్ కూల్చివేసిందంటూ ప్రచారం... ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసిన కేంద్రం
- నేపాల్ పై భారత్ దాడి అంటూ ప్రచారం
- ఇద్దరు భారత పైలెట్ల మృతి అని వెల్లడి
- అవి పాత ఫొటోలు అంటూ కేంద్రం స్పష్టీకరణ
కోట్ ఖరాక్ సింగ్ పెర్నవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, భారత్ వైమానిక దాడులకు ప్రతిగా నేపాల్ కూడా దీటుగా స్పందించి ఓ జెట్ ఫైటర్ ను కూల్చివేసిందని, ఇద్దరు భారత పైలెట్లు మృతి చెందారని ఆ వార్తలో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర సమాచార శాఖ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. భారత వైమానిక దళం ఏ పొరుగుదేశంపైనా దాడికి పాల్పడలేదని, వైరల్ అవుతున్న వార్తలోని ఫొటోలు పాతవి అని, దుష్ప్రచారం చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.