నిమ్మగడ్డ కేసు.. సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
- కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ప్రభుత్వం
- హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశం
- నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోవాలని ఇప్పటికే గవర్నర్ ఆదేశం
హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి విజ్ఞాపన అందజేయగా, దానిని పరిశీలించిన మీదట, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని... సుప్రీం తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందో వేచి చూడాలి.