సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే వినూత్న నిర్ణయం.. ఇక కార్గోలోనూ ఎక్స్ప్రెస్ సేవలు
- ఆగస్టు 5 నుంచి ‘కార్గో ఎక్స్ప్రెస్’
- ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు
- టన్నుకు రూ. 2,500 మాత్రమే
వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు ఈ కార్గో ఎక్స్ప్రెస్తో ప్రయోజనం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. హైదరాబాద్-ఢిల్లీ మధ్య టన్నుకు సగటున రూ. 2,500 కనీస ధరను నిర్ణయించినట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ పేర్కొన్నారు. అయితే, ఇది సరుకును బట్టి మారుతుందని, రోడ్డు రవాణాతో పోలిస్తే 40 శాతం తక్కువని తెలిపారు. అవసరమైన వారు 97013 71976, 040-27821393 నంబర్లలో కానీ, దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్లో కానీ సంప్రదించాలని ఆయన కోరారు.