Corona Virus: తెలంగాణలో ఏమాత్రం తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 1,296 మందికి పాజిటివ్

Corona spreading continues in Telangana
  • తెలంగాణలో 45 వేలు దాటిన పాజిటివ్ కేసులు
  • ఇవాళ మరో ఆరుగురు కన్నుమూత
  • జీహెచ్ఎంసీ పరిధిలో 557 మందికి కరోనా
తెలంగాణలో కరోనా భూతం విపరీతంగా వ్యాపిస్తోంది. కొత్తగా 1,296 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 45,076కి పెరిగింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో ఇవాళ 557 కేసులను గుర్తించారు. తాజాగా 1,831 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 12,224 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ మరో ఆరుగురు కరోనాతో మృత్యువాత పడడంతో మొత్తం మరణాల సంఖ్య 415కి పెరిగింది.
..
Corona Virus
Telangana
Positive
Deaths
COVID-19

More Telugu News