రాజస్థాన్ రాజకీయాల్లో మరో మలుపు.. ఫోన్ల ట్యాంపింగు ఆరోపణలపై స్పందించిన కేంద్రం
- రాజస్థాన్లో కలకలం రేపుతున్న ఆడియో టేపుల వ్యవహారం
- ఇప్పటికే రంగంలోకి దిగిన ఏసీబీ
- వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ సీఎస్కు కేంద్రం ఆదేశం
ఈ వ్యవహారంపై ఏసీబీ ఇప్పటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించగా, ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, రాజ్యంగ విరుద్ధమైన పద్ధతుల్లో రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందని బీజేపీ ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించినట్టు బీజేపీ అంగీకరిస్తోందని కాంగ్రెస్ చెబుతోంది.