ఏపీలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా... త్వరలో కొత్త తేదీలు
- ఎంసెట్ సహా 8 పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు మంత్రి సురేశ్ వెల్లడి
- సెప్టెంబరు మూడో వారానికి వాయిదా
- విద్యార్థులకు మాక్ టెస్టులు
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి సురేశ్ తెలిపారు. అయితే, విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే జాతీయస్థాయిలో నీట్, జేఈఈ, ఐఐటీ ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డ విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.