Andhra Pradesh: ఏపీలో కరోనా మృత్యుఘోష... ఒక్కరోజులో 17 మంది మరణం

Seventeen people dies of corona in AP
  • 309కి చేరిన కరోనా మరణాలు
  • రాష్ట్రంలో మరో 1,813 మందికి పాజిటివ్
  • గత 24 గంటల్లో 1,168 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులో 17 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 309 దాటింది.

ఇక, కొత్తగా 1,813 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 311 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 300, కర్నూలు జిల్లాలో 229, శ్రీకాకుళం జిల్లాలో 204 కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 1,168 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి పెరిగింది. ఓవరాల్ గా 27,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇంకా 12,533 మంది చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh
Corona Virus
Deaths
Positive
COVID-19

More Telugu News