దేశవ్యాప్తంగా సెప్టెంబరు 15 నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలు: ఏఐసీటీఈ
- సవరించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసిన ఏఐసీటీఈ
- కొత్త విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులు మొదలు
- పాత విద్యార్థులకు మాత్రం ఆగస్టు నుంచే
ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. మిగతా విద్యార్థులకు మాత్రం ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును జులై 15 వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. గతంలో దీని గడువు జూన్ 30గా ఉంది. అలాగే, ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్ పూర్తి చేసి మిగిలిన సీట్లను సెప్టెంబరు 15లోగా పూర్తి చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది.