వృద్ధులు, వికలాంగుల పింఛన్ సొమ్ముతో పరారైన గ్రామ వాలంటీర్
- అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండపల్లిలో ఘటన
- రూ. 63 వేలతో పరారైన గ్రామ వాలంటీర్
- స్విచ్చాఫ్ వస్తున్న ఫోన్
ఒకటో తారీఖునే ఈ డబ్బు లబ్ధిదారులకు అందాల్సి ఉంది. అయితే ఆ సొమ్ము అందకపోవడంతో... వారు ఆరా తీశారు. దీంతో, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బుతో పాటు వాలంటీర్ పరారైనట్టు తెలిసింది. అతనికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో అతనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.