దర్శనాల సంఖ్యను పెంచిన టీటీడీ... ఉచిత టికెట్ల జారీ మొదలు పెట్టడంతో వేలమంది క్యూ!
- రోజుకు 3 వేల మందికి ఉచిత దర్శనం
- భూదేవీ కాంప్రెక్స్ లో ప్రత్యేక కౌంటర్
- ఈ నెల 30 వరకూ టికెట్ల జారీ
ఈ ఉదయం టికెట్లను జారీ చేయనున్నామని ప్రకటన వెలువడగానే, భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరికి చేరుకున్నారు. భక్తులంతా భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు అధికారులు కష్టపడాల్సి వచ్చింది. ఈ నెల 30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్ లైన్ టికెట్ల కోటా పూర్తయిందని, ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.