ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది: హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్
- హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయట్లేదని పిటిషన్
- ప్రతివాదులుగా సీఎస్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి
- పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు
కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని పేర్కొంటూ, ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎస్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. దీంతో ఆయన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.