ప్రధాని మోదీ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేయడంలేదు: కన్నా
- అగ్రకుల పేదలకు మోదీ 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారన్న కన్నా
- రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతోందంటూ అసంతృప్తి
- జగన్ సర్కారుకు ఆదేశాలివ్వాలంటూ గవర్నర్ కు లేఖ
ఏపీలో ఈ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఎంతోమంది అనేక అవకాశాలు కోల్పోతున్నారని, ఉపాధి పొందలేకపోవడమే కాకుండా, ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్నారని వివరించారు. ఈ విషయమై ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్టే అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ వెంటనే స్పందించి, ఏపీలోనూ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కన్నా విజ్ఞప్తి చేశారు.