దేశంలోని మురుగునీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు!
- ఐఐటీ గాంధీనగర్ అధ్యయనంలో వెల్లడి
- మానవ విసర్జితాల ద్వారానే బయటకు
- ఇప్పటికే పలు దేశాల్లోని మురుగు నీటిలో వైరస్ గుర్తింపు
వైరస్ను గుర్తించి కట్టడి చేసేందుకు మురుగునీటి పరిశీలన విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ మనీశ్ కుమార్ పేర్కొన్నారు. పోలియో వంటి వైరస్లను గుర్తించేందుకు ఇప్పటికే ఇలాంటి విధానాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఇప్పటికే నెదర్లాండ్స్, అమెరికా, స్వీడన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలోనూ మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించారు.