కియారా కాదట... మహేశ్ బాబు పక్కన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్?

Sai Manjreker gets Chance in Mahesh Film
  • పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చిత్రం
  • 'సర్కారు వారి పాట' టైటిల్ వైరల్
  • 'దబాంగ్ 3' చిత్రంలో నటించిన సాయి
'గీత గోవిందం' తరువాత పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, అది నెట్టింట వైరల్ అయింది కూడా. ఈ సినిమాలో హీరోయిన్ గా మహేశ్ సరసన 'భరత్ అనే నేను'లో నటించిన కియారా అద్వానీ పేరు కూడా ఖరారైనట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పడు కియారా ప్లేస్ లో మరో పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుందన్నది టాలీవుడ్ వర్గాల భోగట్టా. ఇప్పటికే చిత్ర యూనిట్ సాయిని సంప్రదించిందని, ఆమె ఒప్పుకుందని కూడా తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. కాగా, సాయి, ఆ మధ్య వచ్చిన సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' చిత్రంలో నటించింది.
Go Back to Shorts
Mahesh Babu
Sai Manjreker
Sarkaru Vaari Paata
Parashuram

More Telugu News