ఏనుగు మృతి కేసు.. పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు
- గర్భంతో ఉన్న ఏనుగుకు టపాసులతో కూడిన పైనాపిల్
- నోటిలో గాయం కారణంగా ఆహారం తీసుకోలేక మృతి
- దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం
మరోవైపు, ఈ ఘటనను కేరళ ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తు కోసం పోలీసు, అటవీశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నోటిలో గాయం కారణంగా ఆహారం తీసుకోలేకపోయిన ఏనుగు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. కాగా, ఏనుగు మరణానికి కారణమైన వారిగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు.