ముంబయి, గుజరాత్ లో కరోనా వ్యాప్తికి 'నమస్తే ట్రంప్' కార్యక్రమమే కారణం: శివసేన ఎంపీ ఆరోపణ
- గుజరాత్, ముంబయిలో కరోనా విజృంభణ
- ట్రంప్ ను స్వాగతించడానికి లక్షలమంది వచ్చారన్న రౌత్
- వారంతా వివిధ ప్రదేశాలకు తిరిగి వెళ్లడంతో కరోనా వ్యాప్తి చెందినట్టు వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను స్వాగతించడానికి భారీ సంఖ్యలో ప్రజలు రావడమే కరోనా వ్యాప్తికి కారణమని, ఈ విషయంలో కేంద్రం ఏ విధంగా సమర్థించుకోగలదని వ్యాఖ్యానించారు. ట్రంప్ వెంట అమెరికా నుంచి వచ్చిన కొందరు ముంబయి, ఢిల్లీ వంటి నగరాలను సందర్శించారని, ఇలాంటి పరిణామాలే దేశంలో కరోనా వ్యాప్తికి దారితీశాయని రౌత్ విమర్శించారు. ఈ మేరకు సామ్నా పత్రికలోని తన సంపాదకీయంలో పేర్కొన్నారు.