'ఎంత సక్కగ రాశారో' అంటూ గేయ రచయిత చంద్రబోస్‌పై దేవిశ్రీ ప్రసాద్ పాట!

  • చంద్రబోస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25  ఏళ్లు
  • ఆయనకు దేవిశ్రీ అభినందనలు
  • రంగస్థలం సినిమాలో ఎంత సక్కగున్నావే పాట రాసిన చంద్రబోస్
  • ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై దేవిశ్రీ పాట
సినీగేయ రచయిత చంద్రబోస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై ఓ పాటను దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి ఆయనకు అభినందనలు తెలిపాడు. రామ్ చరణ్, సమంతల రంగస్థలం సినిమా కోసం చంద్రబోస్ ఎంత సక్కగున్నావే పాట రాసిన విషయం తెలిసిందే. ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై 'ఎంత సక్కగ రాశారో' అంటూ దేవిశ్రీ పాట పాడారు.  

ఈ పాట అభిమానులను అలరిస్తోంది. కాగా, 1995లో వచ్చిన తాజ్ మహల్ సినిమాకు తొలిసారి సాహిత్యం అందించిన చంద్రబోస్ అప్పటి నుంచి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక అద్భుత పాటలను రాశారు.  



More Telugu News

chandrabose devisri prasad Twitter