తూర్పుగోదావరి జిల్లాలో 2 కిలోమీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం... వీడియో ఇదిగో!
- చింతలమోరిలో ఘటన
- సునామీ హెచ్చరికల్లేకుండానే చొచ్చుకువచ్చిన సముద్రం
- ఉప్పునీటితో నిండిపోయిన పంటపొలాలు
సాధారణంగా 50 మీటర్లు ముందుకు వస్తేనే ఎక్కువని భావిస్తుంటారు. అయితే, ఏకంగా రెండు కిలోమీటర్ల మేర సముద్రం చొచ్చుకురావడంతో ఇక్కడివాళ్లకు కూడా అర్థం కావడంలేదు. సహజంగా సునామీ సమయాల్లోనే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని, సునామీ హెచ్చరికలు లేకుండానే ఇలా జరగడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. సముద్రం ముందుకు రావడంతో అక్కడి పంటపొలాలన్నీ ఉప్పునీటితో నిండిపోయాయి. సారవంతమైన తమ నేలలు సముద్రం నీటి కారణంగా పాడైపోయాయని అక్కడి రైతులు వాపోతున్నారు.