Locusts: ఉత్తరప్రదేశ్ దిశగా దూసుకువస్తున్న రాకాసి మిడతల దండు... అప్రమత్తమైన అధికారులు!

Locusts to reach Uttar Pradesh
  • పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న మిడతలు
  • రాజస్థాన్ చేరుకున్న మిడతల దండు
  • యూపీలో 17 జిల్లాలు ప్రభావితమవుతాయని అంచనా
పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల దండు ఉత్తరప్రదేశ్ దిశగా దూసుకు వస్తున్నట్టు అంచనా వేశారు. ప్రస్తుతం రాజస్థాన్ లోని దౌసా జిల్లా వరకు చేరుకున్న ఈ రాకాసి మిడతలు ఆగ్రా సహా యూపీలో 17 జిల్లాలపై పెను ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. దాంతో, 204 ట్రాక్టర్లను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి ద్వారా మిడతలపై రసాయనాలు పిచికారీ చేయాలని నిర్ణయించింది.

కాగా, రెండ్రోజుల క్రితమే రాజస్థాన్ చేరుకున్న ఈ మిడతల గుంపు గాలి వ్యతిరేక దిశలో వీస్తుండడంతో చెల్లాచెదురయ్యాయి. దాంతో కొన్ని మధ్యప్రదేశ్ దిశగా వెళ్లాయి. అయితే, మరికొన్నిరోజుల్లో రాకాసి మిడతల ప్రభావం యూపీపై పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మిడతలు ఒక్కసారి పంట పొలంపై వాలాయంటే అక్కడ చూడ్డానికి ఏమీ మిగలదు. తమ పదునైన దవడలు, కాళ్లకు ఉన్న నిర్మాణాలతో ముక్కలు ముక్కలుగా కత్తిరించి వేస్తాయి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి.
Locusts
Uttar Pradesh
Rajasthan
Pakistan

More Telugu News