AP High Court: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సుమోటో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా

Vizag gas leak issue hearing adjourned in AP High Court
  • కొన్నిరోజుల క్రితం విశాఖలో గ్యాస్ లీక్
  • సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు
  • కౌంటర్ దాఖలుకి సమయం కోరిన ప్రభుత్వం
ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరీన్ విషవాయువు లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. వందలమంది విషవాయు ప్రభావానికి గురయ్యారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తాజాగా ఈ కేసుపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్ధానాన్ని కోరింది.
AP High Court
Vizag Gas Leak
LG Polymers
Vizag
Andhra Pradesh

More Telugu News